ఆర్టీసీ బస్టాండ్‌లో నగదు చోరీ | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్టాండ్‌లో నగదు చోరీ

Published Tue, Jan 21 2025 12:46 AM | Last Updated on Tue, Jan 21 2025 12:46 AM

-

మరికల్‌: ఆర్టీసీ బస్టాండ్‌లో ఓప్రయాణికుడి జేబులో ఉన్న రూ. లక్ష నగదును చోరీచేసిన ఘటన మరికల్‌లో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వి వరాల మేరకు.. నర్వ మండలం మథన్‌కోడ్‌కి చెందిన రామచందర్‌ బంధువుల వద్ద చేసిన అప్పును తీర్చడం కోసం ఇంటి నుంచి రూ. లక్ష నగదు తీసుకొని ఆటోలో మరికల్‌ బస్టాండ్‌కు వచ్చారు. ఇక్కడి నుంచి కొల్లంపల్లిలో ఉన్న బంధువుల వద్దకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో అతడి జేబులో ఉన్న డబ్బులను గుర్తుతెలియని దుండగులు చోరీ చేశారు. బాధితుడు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈమేరకు కేసు నమోదు చేసి నట్లు ఎస్‌ఐ రాము తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement