ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల ఇబ్బందులు | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల ఇబ్బందులు

Published Mon, May 6 2024 11:55 PM

ధాన్యం కొనుగోళ్లు లేక రైతుల ఇబ్బందులు

● బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌

మందమర్రిరూరల్‌: ధాన్యం కొనుగోళ్లు చేయకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్‌, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ అన్నారు. సోమవారం మండలంలోని సారంగపల్లి వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. రైతులతో మాట్లాడి ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ గతంలో 2.50 కిలోల మెట్రిక్‌ టన్నుల ధాన్యం 15, 16 రోజుల్లో రైస్‌ మిల్లులకు పంపించామన్నారు. ప్రస్తుతం 1.5 కిలోల మెట్రిక్‌ టన్నుల పంట దిగుబడి వచ్చిందని, ఆ ధాన్యాన్ని కూడా కొనలేక ప్రభుత్వం రైతులను ఇబ్బంది పెడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా ఊరుకునేది లేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement