ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులు | Sakshi
Sakshi News home page

ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులు

Published Mon, May 6 2024 11:55 PM

-

శ్రీరాంపూర్‌: పార్లమెంటు ఎన్నికల విధులకు సింగరేణి ఉద్యోగులనూ కేటాయించారు. ఈ నెల 13న పార్లమెంటు ఎన్నికల పోలింగ్‌ నిర్వహణకు సిబ్బంది కావాలని జిల్లా కలెక్టరేట్ల నుంచి కంపెనీకి ఉత్తర్వులు అందాయి. ఈ మేరకు శ్రీరాంపూర్‌ డివిజన్‌లో 35 మంది క్లర్క్‌లు ఎన్నికల విధులకు హాజరు కానున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా వీరు విధులు నిర్వర్తించారు. ఎన్నికల నిర్వహణపై ఇదివరకే శిక్షణ పొందారు. పోలింగ్‌కు రెండ్రోజుల ముందు వీరంతా జిల్లా కలెక్టరేట్‌ కార్యాలయాల్లో రిపోర్టు చేయనున్నట్లు కంపెనీ అధికారులు తెలిపారు. కాగా, ఎన్నికల విధులు నిర్వర్తించే వారికి కంపెనీ ఆ రోజును స్పెషల్‌ లీవుగా పరిగణిస్తుంది. దీన్ని ఓడీగా ఇవ్వాలని క్లర్క్‌లు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement