పెద్దపల్లి జిల్లాకు ధాన్యం తరలింపు | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి జిల్లాకు ధాన్యం తరలింపు

Published Mon, May 6 2024 11:55 PM

పెద్దపల్లి జిల్లాకు ధాన్యం తరలింపు

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ‘ధాన్యం దిగదు.. లారీ కదలదు’ శీర్షికన ఈ నెల 5న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి సోమవారం అధికా రులు స్పందించారు. జిల్లాలోని 19మిల్లుల వద్ద రో జుల తరబడి అన్‌లోడ్‌ కాకుండా ఉండడంతో పక్క జిల్లా పెద్దపల్లిలోని 136 బాయిల్డ్‌ రైస్‌ మిల్లులకు కేటాయించారు. గత కొద్ది రో జులుగా కొనుగోలు కేంద్రాల్లో తూకం వేసిన ధాన్యం మిల్లులకు తరలిస్తే లారీలు అన్‌లోడ్‌ కాకపోవడంతో నిర్వాహకులు, రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తూకం వేసిన ధాన్యం బ స్తాలు, కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పేరుకుపోతున్నాయి. పక్క జిల్లాలోని మిల్లులకు కేటా యించడంతో ధాన్యం తరలింపు, లోడింగ్‌, అన్‌లోడింగ్‌ వేగవంతం అవుతుందని జిల్లా పౌ రసరఫరాల శాఖ అధికారులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement