నీటి కాలువలో పడి వ్యక్తి మృతి | Sakshi
Sakshi News home page

నీటి కాలువలో పడి వ్యక్తి మృతి

Published Tue, May 7 2024 5:30 AM

-

డిండి: ప్రమాదవశాత్తు నీటి కాలువలో పడి వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన సోమవారం డిండి మండలంలోని ఎర్రారం గ్రామ సమీపంలో జరిగింది. వివరాలు.. నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేటకు చెందిన మోనేష్‌(34) తమ బంధువులు డిండి మండలంలోని ఎర్రారం సమీపంలో గల ఫంక్షన్‌హాల్‌లో సోమవారం నిర్వహించిన శుభకార్యానికి హాజరయ్యాడు. ఈ క్రమంలో ఫంక్షన్‌హాల్‌ పక్క నుంచే వెళ్తున్న డిండి ప్రాజెక్టు కాలువలో ప్రమాదవశాత్తు అతడు పడిపోయాడు. చుట్టుపక్కల రైతులు గమనించి మోనేష్‌ను కాలువలోంచి బయటకు తీయగా.. అప్పటికే అతడు మృతిచెందాడు. కాగా ఈ ఘటనకు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ రాజు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement