‘పోస్టల్‌ బ్యాలెట్‌’ ను సద్వినియోగం చేసుకోవాలి | Sakshi
Sakshi News home page

‘పోస్టల్‌ బ్యాలెట్‌’ ను సద్వినియోగం చేసుకోవాలి

Published Tue, May 7 2024 5:30 AM

‘పోస్టల్‌ బ్యాలెట్‌’ ను సద్వినియోగం చేసుకోవాలి

సూర్యాపేటటౌన్‌: ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటును సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట అదనపు కలెక్టర్‌ సీహెచ్‌. ప్రియాంక సూచించారు. సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎస్వీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటు చేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రాలను ఆమె పరిశీలించి మాట్లాడారు. సూర్యాపేట నియోజకవర్గ పరిధిలో ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవడానికి ఆరు కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 8వ తేదీ వరకు ఈ కేంద్రాలు ఉంటాయన్నారు. ఇప్పటి వరకు 1,435 మంది ఎన్నికల సిబ్బంది పోస్టల్‌ బ్యాలెట్‌ ఓటు వినియోగించుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ శ్యామ్‌సుందర్‌రెడ్డి, ఎంపీఓ గోపి పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement