తెలుగు విశ్వవిద్యాలయం వీసీగా మంగనూర్‌ వాసి | - | Sakshi
Sakshi News home page

తెలుగు విశ్వవిద్యాలయం వీసీగా మంగనూర్‌ వాసి

Published Sat, Oct 19 2024 12:12 AM | Last Updated on Sat, Oct 19 2024 12:12 AM

తెలుగు విశ్వవిద్యాలయం వీసీగా మంగనూర్‌ వాసి

బిజినేపల్లి: మండలంలోని మంగనూర్‌లో తెలుగు భాషా కుటుంబంగా పేరు గడించిన విశ్రాంత ఉస్మానియా సీనియర్‌ ప్రొఫెసర్‌ వెలుదండ నిత్యానందరావును తెలుగు విశ్వవిద్యాలయం వైస్‌ చాన్స్‌లర్‌గా నియమిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. 1962 ఆగస్టు 9న రామేశ్వర్‌రావు, లక్ష్మమ్మ దంపతుల రెండో సంతానంగా జన్మించిన నిత్యానందరావు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నారు. తర్వాత పాలెం ఓరియంటల్‌ కళాశాలలో ప్రముఖ పండితులు కపిలవాయి లింగమూర్తి, రంగాచార్యుల వద్ద శిష్యరికంలో డిగ్రీ పట్టభద్రుడు అయ్యారు. ఈయన 1985లో ప్రథమ శ్రేణిలో ఎంఏ తెలుగు పూర్తి చేశారు. 1988లో ఎంఫిల్‌, 1990లో పీహెచ్‌డీ పూర్తి చేశారు. 1992లో ఉస్మానియా తెలుగు శాఖలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా చేరి.. వివాదరహితుడిగా,రచయితగా పే రు గడించారు. అంచెలంచెలుగా ఎదిగి.. ఉస్మానియా తెలుగు శాఖ అధ్యక్షుడిగా, పాఠ్య ప్రణాళిక సంఘం అధ్యక్షుడిగా కొనసాగారు. 2022 లో ఓయూ సీ.ప్రొఫెసర్‌గా పదవీ విరమణ పొందారు. నిత్యానందరావును వీసీగా నియమించడంపైగ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement