బాసరలో త్రిపుర గవర్నర్‌ పూజలు | - | Sakshi
Sakshi News home page

బాసరలో త్రిపుర గవర్నర్‌ పూజలు

Published Wed, Feb 12 2025 12:19 AM | Last Updated on Wed, Feb 12 2025 12:19 AM

బాసరలో త్రిపుర గవర్నర్‌ పూజలు

బాసరలో త్రిపుర గవర్నర్‌ పూజలు

బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని మంగళవారం త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి దర్శించుకున్నారు. ముందుగా గవర్నర్‌తోపాటు ముధోల్‌ ఎమ్మెల్యే రామారావుపటేల్‌ గోదావరినదిలో పుణ్యస్నానమాచరించారు. అనంతరం ఆలయానికి చేరుకోగా అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్‌ అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. అర్చకులు అమ్మవారి హారతి, తీర్థప్రసాదాలు అందించి ఆశీర్వదించారు. ఆలయ సమీపంలో ప్రతీ సంవత్సరం నిర్వహించే బ్రహ్మీ తీర్థంలో గవర్నర్‌ పాల్గొన్నారు. వీరి వెంట మాజీ సర్పంచ్‌ సతీశ్వర్‌రావు, ఆలయ అధికారులున్నారు.

గవర్నర్‌కు సన్మానం

భైంసాటౌన్‌: త్రిపుర గవర్నర్‌ ఇంద్రసేనారెడ్డి సోమవారం రాత్రి పట్టణంలోని ఎమ్మెల్యే రామారావు పటేల్‌ నివాసానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు బీజేపీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికి శాలువాతో సన్మానించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement