ఈతకు వెళ్లి బాలుడి మృతి | - | Sakshi
Sakshi News home page

ఈతకు వెళ్లి బాలుడి మృతి

Published Tue, Jul 4 2023 12:32 AM | Last Updated on Tue, Jul 4 2023 12:32 AM

ఆనంద్‌ (ఫైల్‌)  - Sakshi

కామారెడ్డి క్రైం : చెరువులో స్నానం చేయడానికి ఈతకు వెళ్లిన మైనర్‌ బాలుడు మృత్యువాత పడ్డాడు. బాలుడిని ఎందుకు తీసుకెళ్లావని బాలుడి మామను స్థానికులు చితకబాదగా మనస్తా పంతో చెంది అదే చెరువులో దూకి ఆత్మహత్యకు యత్నించగా మామను స్థానికులు కాపాడి ఆస్పత్రికి తరలించారు. కామారెడ్డి మండలం శాబ్దిపూర్‌తండా చెరువులో జరిగిన ఈ ఘటన జరిగింది. కామారెడ్డి పట్టణంలోని గుమాస్తా కాలనీకి చెందిన రమేశ్‌ అతని అల్లుడు ఆనంద్‌ (14)ను తీసుకుని శాబ్దిపూర్‌తండాలో ఉన్న చెరువుకు ఈత కొట్టడానికి వెళ్లారు. ముందుగా ఆనంద్‌ స్నానం చేయడానికి చెరువులో దిగాడు. చెరువులో గుంతలు ఉండటంతో నీటిలో మునిగి ఆనంద్‌ మృతి చెందాడు. విషయం తెలుసుకుని చెరువు వద్దకు వెళ్లిన స్థానికులు చిన్న పిల్లవాడిని ఈతకు ఎందుకు తీసుకెళ్లావని రమేశ్‌ను చితకబాదారు. అయితే స్థానికులు చేసిన పనికి మనస్థాపం చెందిన రమేశ్‌ ఆత్మహత్య చేసుకునేందుకు అదే చెరువులో దూకాడు.

గమనించిన స్థానికులు రమేశ్‌కు కాపాడారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు, ఫైర్‌ సిబ్బంది ఆనంద్‌ మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆ త్మహత్యకు యత్నించిన రమేశ్‌కు జిల్లా ఆస్పత్రిలో చికిత్స చేస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

చెరువుకు తీసుకెళ్లిన మామను

చితకబాదిన స్థానికులు

మనస్తాపంతో అదే చెరువులో దూకి

ఆత్మహత్యాయత్నం చేసిన మామ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement