చెట్టును ఢీకొని ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొని ఒకరి మృతి

Published Mon, May 6 2024 5:55 AM

-

సిరికొండ: చెట్టును ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని సర్పల్లి తండాలో శివారులో చోటు చేసుకుంది. ఎస్సై రమేశ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇందల్వాయి మండలం గౌరారం గ్రామానికి చెందిన సంపంగి మహేందర్‌(28)కు సర్పల్లి తండా పరిధిలోని వడ్డెర కాలనీకి చెందిన లతికతో వివాహమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో సిరికొండలో కుల సంఘంలో ఆదివారం ఇరువర్గాలు చర్చించుకుందామని నిర్ణయించారు. దీంతో మహేందర్‌ తన బైక్‌పై సిరికొండకు వస్తుండగా తండా సమీపంలో చెట్టును ఢీకొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడి తల్లి సాయమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కుమారులు ఉన్నారు.

Advertisement
Advertisement