అల్ప్రాజోలం పట్టివేత | Sakshi
Sakshi News home page

అల్ప్రాజోలం పట్టివేత

Published Mon, May 6 2024 6:00 AM

అల్ప్రాజోలం పట్టివేత

భిక్కనూరు: నిషేధిత మత్తు పదార్థమైన అల్ప్రాజోలంను రవాణా చేస్తూ పట్టుబడ్డ నలుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు భిక్కనూరు సీఐ సంపత్‌, ఎస్సై సాయికుమార్‌ ఆదివారం తెలిపారు. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పెద్దమల్లారెడ్డి గ్రామశివారులోని పెట్రోల్‌బంక్‌ సమీపంలో టీఎస్‌16 ఈడబ్ల్యూ 1970 గల కారును ఉన్నతాఽధికారుల ఆదేశాల మేరకు తనిఖీ చేయగా వీరి నుంచి 248 గ్రాముల అల్ప్రాజోలం పట్టుకున్నారు. నాలుగు సెల్‌ఫోన్లు, రూ. 37,020 నగదు, కారును స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. అల్ప్రాజోలం సరఫరా చేస్తున్న నవీపేటకు చెందిన గొల్లపల్లి నరేశ్‌గౌడ్‌, గాంధారికి చెందిన భీమగౌని దత్తాద్రిగౌడ్‌, మాక్లుర్‌కు చెందిన ఎల్లగౌని సంతోష్‌గౌడ్‌, సంగం గ్రామానికి చెందిన కేసరి మల్లికార్జున్‌గౌడ్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి కోర్టు న్యాయయూర్తి నలుగురికి 14 రోజుల రిమాండ్‌కు నిజమాబాద్‌ జిల్లా జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎస్సై–2 రాంచందర్‌ పాల్గొన్నారు.

కుర్నాపల్లిలో..

ఎడపల్లి: మండలంలోని కుర్నాపల్లిలో అల్ప్రాజోలంను ఎకై ్సజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దాడులు చేసి స్వాధీనం చేసుకున్నారు. గ్రామస్తుల తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో ఇద్దరి వ్యక్తుల వద్ద సుమారు కిలో వరకు మత్తుపదార్థాలు ఉన్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడిలో ఒకరిని అదుపులోకి తీసుకోగా మరొకరు పరారీలో ఉన్నట్లు తెలిసింది.

Advertisement
Advertisement