బీజేపీలో పైరవీలకు స్థానం లేదు | Sakshi
Sakshi News home page

బీజేపీలో పైరవీలకు స్థానం లేదు

Published Tue, May 7 2024 10:50 AM

బీజేపీలో పైరవీలకు స్థానం లేదు

ఆర్మూర్‌ : బీజేపీలో పైరవీలకు స్థానం లేదని ఎంపీ, అభ్యర్థి అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ అన్నారు. ఆర్మూ ర్‌ మండలం అంకాపూర్‌లో సోమవారం నిర్వహించిన చాయ్‌పే చర్చాలో ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్వింద్‌ మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా 10 మంది మంత్రులు, 105 మంది సిట్టింగ్‌ ఎంపీలకు బీజేపీ హైకమాండ్‌ టికెట్లు కేటాయించలేదన్నారు. పనిచేసే వారికే బీజేపీలో గుర్తింపు ఉంటుందన్న విషయాన్ని గమనించాలన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే భవిష్యత్‌లో ప్రాధాన్యత ఉంటుందన్నారు. పసుపు రైతులు వ్యాపారం నేర్చుకుని భవిష్యత్‌లో వ్యాపారవేత్తలుగా మారాలని, రానున్న రోజుల్లో క్వింటాల్‌ పసుపు ధర రూ.20వేలకు పైగా పలుకుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రానికి సహకరించడం లేదని, అవినీతి, అక్రమాలతో వ్యవస్థలు కుంటుపడ్డాయని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు రేషన్‌ బియ్యాన్ని రీసైక్లింగ్‌ చేస్తున్నారని ఆరోపించారు. ఆర్మూర్‌ మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కంచెట్టి గంగాధర్‌, నాయకులు పాల్గొన్నారు.

రైతులు వ్యాపారులుగా మారాలి

చాయ్‌ పే చర్చలో ఎంపీ అర్వింద్‌

Advertisement

తప్పక చదవండి

Advertisement