జనసేవ కేంద్రాల నిర్వాహకుల నిరసన | - | Sakshi
Sakshi News home page

జనసేవ కేంద్రాల నిర్వాహకుల నిరసన

Published Thu, Sep 12 2024 8:26 AM | Last Updated on Thu, Sep 12 2024 8:26 AM

జనసేవ కేంద్రాల నిర్వాహకుల నిరసన

పర్లాకిమిడి: సుభద్ర పథకం అమలుపై జిల్లాలోని జనసేవ కేంద్రాల నిర్వాహకులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు పట్టణంలోని కలెక్టరేట్‌కు బుధవారం వెళ్లి కలెక్టర్‌ బిజయ కుమార్‌ దాస్‌ను కలిశారు. సుభద్ర యోజన పథకం దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేసేందుకు జిల్లా అధికారులు కేవలం రూ.15లు మంజూరు చేస్తున్నారని, అయితే దాంట్లో జీఎస్టీ మినహాయిస్తే కేవలం రూ.10లు మాత్రమే మిగులుతుందన్నారు. ఇది ఎంతమాత్రం సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్‌ స్పందించి, సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement