రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం తగదు | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడం తగదు

Published Thu, Sep 12 2024 8:26 AM | Last Updated on Thu, Sep 12 2024 8:26 AM

-

శ్రీకాకుళం (పీఎన్‌కాలనీ): ఢిల్లీలో జాతీయస్థాయిలో మాల పెద్దలు తీసుకున్న నిర్ణయానికి మద్దతుగా శ్రీకాకుళం ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో బుధవారం అంబేడ్కర్‌ కూడలి వద్ద ధర్నా నిర్వహించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ తీర్పును వెనక్కి తీసుకోవాలని, పునఃపరిశీలించాలని నినాదాలు చేశారు. రాజకీయ లబ్ధి కోసం ఎస్సీ, ఎస్టీ, మాల, మాదిగల మధ్య చిచ్చు పెట్టడం సరికాదన్నారు. ఎస్సీ కార్పొరేషన్‌ ద్వారా సౌకర్యాలను కల్పించి అండగా నిలవాలన్నారు. ఏబీసీడీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్నారు. అనంతరం ఇలిసిపురంలోని అంబేడ్కర్‌ విజ్ఞాన మందిరంలో దళిత మహాసభ రాష్ట్ర నాయకులు డాక్టర్‌ గంజి ఆర్‌.ఎజ్రా అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర దళిత మహాసభ గౌరవ అధ్యక్షుడు పి.బెంజిమన్‌, మాల మహానాడు రాష్ట్ర కన్వీనర్‌ ఎన్‌.భరత్‌భూషణ రాజు, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల సంఘం నాయకులు పోతల దుర్గారావు, ఎస్సీ వర్గీకరణ సమితి జిల్లా కన్వీనర్‌, బోకర నారాయణరావు, మాలమహానాడు రాష్ట్ర కార్యదర్శి బోనెల అప్పారావు, దళిత హక్కుల పరిరక్షణ సమితి నాయకులు అంపోలు ప్రతాప్‌, రాంబాబు, శ్యామసుందర్‌, సీర రమేష్‌, బి.మురళీకృష్ణ, సాకేటి నాగరాజు, వై.గడ్డెయ్య, గోవిందు, డి.రాము, మూర్తి, జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement