కారు ఢీకొని విశ్రాంత ప్రిన్సిపాల్‌ మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని విశ్రాంత ప్రిన్సిపాల్‌ మృతి

Published Thu, Sep 12 2024 8:26 AM | Last Updated on Thu, Sep 12 2024 8:26 AM

కారు ఢీకొని విశ్రాంత ప్రిన్సిపాల్‌ మృతి

ఎచ్చెర్ల క్యాంపస్‌: కింతలిమిల్లు సమీపంలో జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కేశవరావుపేటకు చెందిన విశ్రాంత ప్రిన్సిపాల్‌ పూజారి శ్రీరాములు(77) మృతి చెందారు. రోడ్డు దాటుతుండగా విశాఖపట్నం వైపు వెళుతున్న కారు ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఘటనా స్థలంలోనే తుదిశ్వాస విడిచారు. ఎచ్చెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శ్రీరాములుకు భార్య, కుమారుడు ఉన్నారు. జిల్లాలోని పలు ప్రభుత్వ కళాశాలల్లో అధ్యాపకునిగా విధులు నిర్వర్తించిన శ్రీరాములు స్వగ్రామం కేశవరావుపేట. శ్రీకాకుళం పట్టణంలో నివాసముంటూ అప్పుడప్పుడూ గ్రామానికి వస్తుండేవారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement