రాష్ట్రంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. ప్రధానంగా కటక్, భువనేశ్వర్ జంట నగరాల్లో అత్యంత అట్టహాసంగా పూజలు నిర్వహించారు. అమ్మవారు తొమ్మిది రోజుల పాటు తొమ్మిది అవతారాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. పలుచోట్ల స్వర్ణాలంకరణతో కనిపించి కనులవిందు చేశారు. దీంతో అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. తమ కుటుంబాలను కాపాడాలని కోరుతూ మొక్కులు చెల్లించుకున్నారు. చివరిగా దసరా రోజున ఆయుధ పూజలు చేపట్టారు. – సాక్షి నెట్వర్క్
Comments
Please login to add a commentAdd a comment