మల్కన్గిరి: మారుమూల గ్రామాలకు రహదారి సౌకర్యాలు లేకపోవడంతో గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. జిల్లాలోని చిత్రకొండ సమితి బోడపోదర్ పంచాయతీ సమరంగిని గ్రామానికి చెందిన శాంతమ్మ ఖోర అనే గర్భిణికి నెలలు నిండడంతో శనివారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో వెంటనే ఆమె భర్త చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి ఫోన్చేసి అంబులెన్స్ పంపించాలని కోరారు. అయితే సమరంగిని గ్రామానికి సరైన రహదారి లేకపోవడంతో సుమారు రెండు కిలోమీటర్ల ముందునే అంబులెన్స్ ఆగిపోయింది. దీంతో చేసేదేమీలేక స్వయంగా కుటుంబ సభ్యులు ఆమెను స్టెచ్చర్పై కూర్చొబెట్టి అంబులెన్స్ వరకు మోసుకెళ్లారు. అనంతరం చిత్రకొండ ఆరోగ్య కేంద్రానికి తరలించగా, పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment