కాశీబుగ్గ: దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మందస మండలం అంబుగాంలో ఆదివారం జిల్లాస్థాయి నృత్య పోటీలు భవన నిర్మాణ కార్మిక సంఘం, జైభవానీ మోటార్ యూనియర్ సంఘం ఆధ్వర్యంలో జరిగాయి. ఈ పోటీలకు న్యాయ నిర్ణేతగా డాక్టర్ కుమార్నాయక్ కేకే సుమన్, మాస్టర్ రుషి, వ్యవహరించారు. గ్రూప్, డ్యూయెట్, సోలో మూడు విభాగాలుగా పోటీలు సాగాయి. విజేతలుగా గ్రూప్ విభాగంలో కాళీమాత సోంపేట ప్రథమ బహుమతి కై వసం చేసుకోగా, ఆర్డీక్స్ పలాస, హరిపురం వారు ద్వితీయ తృతీయ బహుమతులు అందుకున్నారు. డ్యూయెట్ విభాగంలో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు కోటబొమ్మాళి, సోంపేట, హరిపురానికి చెందిన డ్యాన్సర్లకు దక్కాయి. సోలో విభాగంలో వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గీతిక, రాక్ స్టార్ చిరు, వేణురాయల్కు దక్కాయి.
Comments
Please login to add a commentAdd a comment