జగనన్న సారథ్యంలోనే రాష్ట్రం సుభిక్షం | Sakshi
Sakshi News home page

జగనన్న సారథ్యంలోనే రాష్ట్రం సుభిక్షం

Published Tue, May 7 2024 11:30 AM

జగనన్న సారథ్యంలోనే రాష్ట్రం సుభిక్షం

ఈపూరు: రాష్ట్రంలో ప్రజలందరూ సుఖశాంతులతో, సుభీక్షంగా ఉండాలంటే మరోసారి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. మండలంలోని బోడెపూడివారిపాలెం, దూష్మాన్‌పేట, కొండ్రముట్ల తదితర గ్రామాల్లో సోమ వా రం ఎన్నికల ప్రచారం నిర్వహించా రు. జగన్‌మోహన్‌రెడ్డి గత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలను తూ.చ. తప్పకుండా పాటించి అమలు చేశారని, అలాగే ఇప్పుడు ప్రకటించిన మేనిఫెస్టో కూడా మళ్లీ అధికారంలోకి వస్తే తప్పకుండా నెరవేరుస్తారన్నా రు.

కనుక వినుకొండలో బొల్లా బ్రహ్మ నాయుడును, నరసరావుపేట ఎంపీగా అనిల్‌కుమార్‌ యాదవ్‌ను గెలిపించాలని, మీ అందరి ఆశీర్వాదంతో జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఎమ్మెల్యే బొల్లా అన్నారు.చంద్రబాబు చెప్పేవి బూటకపు మాటలని, ఏ ఒక్క హామీ నెరవేర్చడని, అది అందరికీ తెలిసిన విష యమే అన్నారు. గతంలో చంద్ర బాబు 14 ఏళ్లు ముఖ్యమంత్రి గా చేసి ఈ రాష్ట్రానికి, ప్రజలు ఏం వెలగబెట్టారో చెప్పాలని, ఇక వినుకొండలో బురిడీబాబా ఆంజనేయు లు చేసిన అభివృద్ధి ఏమిటో ప్రజలందరికీ తెలుసన్నారు. ఆయన వేసిన శిలాఫలకాలు శిథిలమయ్యాయి

పట్టం కట్టాల్సిన బాధ్యత మనందరిదే ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఈపూరు మండలంలో ఎన్నికల ప్రచారం

Advertisement

తప్పక చదవండి

Advertisement