హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేయాలి | - | Sakshi
Sakshi News home page

హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేయాలి

Published Mon, Oct 28 2024 1:51 AM | Last Updated on Mon, Oct 28 2024 1:50 AM

హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేయాలి

హక్కుల సాధనే లక్ష్యంగా పనిచేయాలి

విజయనగరం రూరల్‌: పంచాయతీ ఉద్యోగులంతా తమ హక్కుల సాధనే లక్ష్యంగా ముందుకు సాగాలని ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘ అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్‌ అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పరిషత్‌ మినీస్టీరియల్‌ సంఘ కార్యాలయంలో ఉత్తరాంధ్ర పంచాయతీ ఉద్యోగులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో 116 ఎంపీడీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అలాగే డీఎల్‌డీఓ 26 మంది.. జూనియర్‌ అసిస్టెంట్లు 23 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు చెప్పారు. ఈ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. ఇదిలా ఉంటే యూనియన్‌ సమావేశానికి చాలామంది హాజరుకాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సంఘ రాష్ట్ర జనరల్‌ కార్యదర్శి కేఎన్‌వీ ప్రసాద్‌ మాట్లాడుతూ.. సమస్యల పరిష్కారానికి ఉద్యోగులందరూ సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో సంఘ సభ్యులు జె.సుబ్బారెడ్డి, ఆవు సురేష్‌, బి.శ్రీనివాసరావు, కె.రామకృష్ణరాజు, సీహెచ్‌ మురళి, తదితరులు పాల్గొన్నారు.

ఏపీ పంచాయతీ కార్యదర్శుల సంఘ

అధ్యక్షుడు వైవీడీ ప్రసాద్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement