ప్రజలకు మెరుగైన వైద్యం అందించేందుకు జీజీహెచ్(రిమ్స్)లో వసతులు కల్పించారు. జీజీహెచ్లో దాదాపు రూ.10 కోట్లతో ఎంఆర్ఐ, సీటీ స్కాన్ మెషీన్లు ఏర్పాటు చేశారు. రూ.50 కోట్లతో మెడికల్ కాలేజీ అదనపు భవన నిర్మాణ పనులు చేపట్టారు. పేర్నమిట్ట సమీపంలోని పీర్లమాన్యం, రాజీవ్ గృహకల్ప కాలనీ, త్రోవగుంట, గద్దలగుంట, మదర్ థెరిసా కాలనీల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు ఏర్పాటు చేశారు. విపత్కర పరిస్థితులు అధిగమించేలా రూ.40 కోట్లతో ఆక్సిజన్ లైన్లు, అధునాతన ఐసీయూ బ్లాక్స్, చిన్నపిల్లలకు అవసరమైన ఎన్ఎస్ఐసీయూ ఏర్పాటు చేశారు. కొత్తపట్నం, కరవది, ఈతముక్కల పీహెచ్సీలను రూ.1.20 కోట్లతో ఆధునికీకరించింది. ఇక కోవిడ్ సమయంలో బాలినేని సొంతంగా 100 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుతోపాటు రోగులకు ఆక్సిజన్, పౌష్టికాహారం ఉచితంగా అందించారు.
గూడు గోడు తీరేలా..
నియోజకవర్గంలో నివేశన స్థలాలకు అర్హులైన పేదలు 30 వేల మందికిపైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ముఖ్యంగా ఒంగోలు నగరంలో రూ.230 కోట్లు వెచ్చించి ప్రైవేట్ భూములు సేకరించి 20,840 మంది పేదలకు ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి అందించారు. మరో 4 వేల మందికి స్థలాలు అందించేందుకు దరఖాస్తులు స్వీకరించారు. ఆ స్థలాల్లో పేదలు ఇళ్లు కట్టుకునేందుకు రాయితీ కింద రూ.1100 కోట్లు మంజూరు చేశారు. ఈ లేఔట్లో తాగునీటి పైపులైన్ల కోసం మరో రూ.230 కోట్లు మంజూరయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment