బలిజ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వినతి | - | Sakshi
Sakshi News home page

బలిజ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వినతి

Published Sat, May 11 2024 8:30 AM | Last Updated on Sat, May 11 2024 8:30 AM

బలిజ

ఒంగోలు: ప్రస్తుత ఎన్నికల్లో బలిజల మద్దతు వైఎస్సార్‌ సీపీకే అని ఏపీ బలిజ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు కూనపరెడ్డి శివశంకరరావు స్పష్టం చేశారు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్‌ సీపీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిని కలిశారు. రాష్ట్రంలో బలిజ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని కోరుతూ వినతిపత్రం అందించారు. కార్పొరేషన్‌ ఆవశ్యకత గురించి వివరించారు. సజ్జల రామకృష్ణారెడ్డి సానుకూలంగా స్పందించడం ఆనందంగా ఉందని, తప్పకుండా బలిజల ఆకాంక్ష తీరే రోజు అతి తొందరలోనే ఉందని శివశంకరరావు తెలిపారు.

ట్రాక్టర్‌ పైనుంచి పడి

కూలి మృతి

తాళ్లూరు(ముండ్లమూరు): మండలంలోని బొద్దికూరపాడు గ్రామ సమీపంలో మిరపకోత కూలీల ట్రాక్టర్‌పై నుండి పడి గడ్డం రాజ్యలక్ష్మి (38) అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు... గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మందాది గ్రామానికి చెందిన పలువురు కూలీలు మిరప కోత కొరకు వచ్చి గ్రామంలో ఉంటున్నారు. శుక్రవారం మిరప కోత పనులకు వెళ్తుండగా మార్గమధ్యంలో ట్రాక్టర్‌ డోర్‌ ఊడి పడడంతో ట్రాక్టర్‌ డోర్‌ పక్కనే కూరున్న గడ్డం రాజ్యలక్ష్మి ప్రమాదవశాత్తు కిందపడింది. దీంతో ట్రాక్టర్‌ టైర్‌ ఆమె భుజంపైకి ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి స్వగ్రామం బొద్దికూరపాడు. మృతురాలికి భర్త, ముగ్గురు ఆడ పిల్లలు, మగ పిల్లాడు ఉన్నారు. భర్త ధామస్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వైవీ రమణయ్య తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
బలిజ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వినతి 1
1/1

బలిజ కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని వినతి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement