రుణాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన | - | Sakshi
Sakshi News home page

రుణాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన

Published Thu, Oct 24 2024 12:45 AM | Last Updated on Thu, Oct 24 2024 12:45 AM

రుణాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన

రుణాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన

ఒంగోలు సబర్బన్‌: వివిధ రకాల రుణాలు, కేంద్ర ప్రభుత్వం అందించే పథకాలపై స్టేట్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఒంగోలు రీజినల్‌ మేనేజర్‌ కార్యాలయం ఆధ్వర్యంలో ఒంగోలు నగరంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. జిల్లా రీజినల్‌ మేనేజర్‌ ఎస్‌.గున్నేశ్వరరావు, ఆర్‌ఏసీపీసీ ఏజీఎం పీ.టి.వెంకట్రావుల నేతృత్వంలో నగరంలోని రంగారాయుడు చెరువు కట్టపై ఉన్న వాకింగ్‌ ట్రాక్‌ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. నగరంలోని వివిధ ఎస్‌.బి.ఐ.శాఖలకు చెందిన సిబ్బందితో కలిసి ఎస్‌బీఐ ఆర్‌ఎం, ఆర్‌ఏసీపీసీలతో కలిసి అనంతరం ప్రధాన రోడ్లలో ర్యాలీ నిర్వహించారు. ఎస్‌బీఐ బ్యాంక్‌ల ద్వారా అందిస్తున్న వివిధ రుణాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు పంచిపెట్టి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆర్‌ఎం ఎస్‌.గున్నేశ్వరరావు మాట్లాడుతూ గృహ రుణాలపై అందిస్తున్న ప్రత్యేక రాయితీలు, ప్రధానమంత్రి సూర్య ఘర్‌ పథకం ద్వారా అందజేస్తున్న రుణాల గురించి వివరించారు. ఆర్‌.ఏ.సి.పి.సి., ఏజీఎం పి.టి.వెంకట్రావు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన 2.0 కింద వచ్చే మార్గదర్శకాల మేరకు రాయితీ ఇవ్వనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో చీఫ్‌ మేనేజర్లు వేదం రాజేష్‌ బాబు, పి.వీరయ్య, నాగేశ్వరరావు, కె.రామారావు, ఒంగోలు ఆర్‌ఎం సీఏ ఆర్‌బీఓ సీహెచ్‌ శ్రీనివాస రావు, హెచ్‌ఆర్‌ మేనేజర్‌ ఆర్‌బీఓ నళినీకాంత్‌, ఆఫీసర్స్‌ సెక్రటరీ సీహెచ్‌ శ్రీనివాసులు, బ్రాంచి మేనేజర్లు నిర్మల కుమారి, కిషోర్‌, హేమకేసర్‌, దీప్తి, కె.జానకి రామయ్య, వి.శ్రీనివాసరావు, పి.బి.చంద్రశేఖర్‌, ఎం.సూరజ్‌, శ్రీధర్‌, కోటేష్‌ బాబు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement