గ్రంథాలయాల అభివృద్ధికి కృషి
చేవెళ్ల: గ్రంథాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎ.మధుసూదన్రెడ్డి అన్నారు. త్వరలోనే చేవెళ్లలో నూతన గ్రంథాలయ అధునాతన భవనం నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మండలకేంద్రంలో శనివారం ఆయన స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి గ్రామంలోని పాత గ్రంథాలయాన్ని పరిశీలించారు. నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. ఎంపీడీఓ కార్యాలయం ముందున్న పాత క్వార్టర్స్ స్థలం ఎంతో బాగుందని, ఇక్కడే అధునాతన సౌకర్యాలతో ఉండే గ్రంథాలయ నిర్మాణం చేపట్టేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఇప్పుడు వచ్చిన నిధులకు ఆదనంగా మరికొన్ని నిధులు కేటాయించి ఇక్కడే మంచి గ్రంథాలయ భవనం నిర్మాంచేందుకు చర్యలు తీసుకుంటానని చెప్పారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అద్యక్షుడు వీరేందర్రెడ్డి, నియోజకవర్గం నాయకులు ఎస్.వసంతం, జిల్లా నాయకుడు ఆగిరెడ్డి, పీఏసీఎస్ చైర్మన్ దేవర వెంకట్రెడ్డి, చేవెళ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ జి.పెంటయ్యగౌడ్, వైస్ చైర్మన్ బి.రాములు, డైరెక్టర్లు, నాయకులు పాల్గొన్నారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి
అభివృద్ధికి అధిక నిధులు
షాబాద్: గ్రంథాలయాల అభివృద్ధికి అధిక నిధులు కేటాయించి, విద్యా వెలుగులకు ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్రెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న గ్రంథాలయ భవనాన్ని శనివారం ఆయన జిల్లా గ్రంథాలయ సంస్థ సెక్రటరీ మనోజ్తో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్థానికుల విజ్ఞప్తి మేరకు షాబాద్ గ్రంథాలయం చుట్టూ ప్రహరీ నిర్మించి వీలైనంత త్వరగా ప్రారంభిస్తామన్నారు. కొన్ని రోజులుగా అసంపూర్తిగా ఉన్న గ్రంథాలయ భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్, ఎంపీటీసీ మాజీ సభ్యుడు అశోక్, నాయకులు రాహుల్గుప్తా, అన్వర్, అక్తర్పాషా, సుభాష్రెడ్డి, సంజీవరెడ్డి, ప్రభాకర్రెడ్డి, చేవెళ్ల స్వామి, శ్రీనివాస్రెడ్డి, జానీ, కృష్ణ, గౌరీశ్వర్, సత్యనారాయణ, కిషోర్నాయక్, ప్రశాంత్, జలీల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment