మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

Published Sun, Oct 27 2024 11:37 AM | Last Updated on Sun, Oct 27 2024 11:37 AM

మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి

రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు ఆదిబట్ల పోలీస్‌స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీ

ఇబ్రహీంపట్నంరూరల్‌: మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ సుధీర్‌బాబు పేర్కొన్నారు. ఆదిబట్ల పోలీస్‌ స్టేషన్‌ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్‌ నిర్వహణపై సీఐ రాఘవేందర్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్‌, పెట్రోలింగ్‌ స్టాఫ్‌ విభాగాల పనితీరు, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి.. నేరాలను అరికట్టడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సుధీర్‌బాబు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల విషయంలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement