మహిళా భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి
రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు ● ఆదిబట్ల పోలీస్స్టేషన్లో ఆకస్మిక తనిఖీ
ఇబ్రహీంపట్నంరూరల్: మహిళా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్బాబు పేర్కొన్నారు. ఆదిబట్ల పోలీస్ స్టేషన్ను శనివారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్స్టేషన్ నిర్వహణపై సీఐ రాఘవేందర్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. రిసెప్షన్, పెట్రోలింగ్ స్టాఫ్ విభాగాల పనితీరు, ఎలాంటి నేరాలు జరుగుతున్నాయి.. నేరాలను అరికట్టడం కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తదితర విషయాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా సుధీర్బాబు మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరం కృషి చేద్దామని పిలుపునిచ్చారు. సమస్యాత్మక ప్రాంతాల విషయంలో ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment