మిరుదొడ్డి(దుబ్బాక): విధులను సక్రమంగా నిర్వర్తిస్తేనే సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. అక్బర్పేట–భూంపల్లి మండల ఏంఈఓగా నూతనంగా బాధ్యతలను చేపట్టిన అంజా గౌడ్ను బుధవారం విద్యార్థులతో కలిసి ఆయన శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులను ఉన్నతులుగా తీర్చి దిద్దడానికి ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. విద్యాభివృద్ధికి ప్రతి ఒక్కరు పాటు పడినప్పుడే సత్ఫలితాలు లభిస్తాయని చెప్పారు. కార్యక్రమంలో ఉన్నత పాఠశాల హెచ్ఎం రాజేందర్, పీడీ వెంకట్ రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ వెంకటయ్య
Comments
Please login to add a commentAdd a comment