చంద్రబాబు హామీలను నమ్మొద్దు | Sakshi
Sakshi News home page

చంద్రబాబు హామీలను నమ్మొద్దు

Published Tue, May 7 2024 5:10 AM

చంద్రబాబు హామీలను నమ్మొద్దు

కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి

బుచ్చిరెడ్డిపాళెం రూరల్‌: ‘ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు ఇష్టానుసారంగా హామీలను ఇస్తున్నాడు. వాటిని ప్రజలు నమ్మొద్దు’ అని కోవూరు ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి ప్రజలను కోరారు. మండలంలోని పంచేడు, మినగల్లు గ్రామ పంచాయతీల పరిధిలో సోమవారం ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రజలకు ఏనాడూ మంచి చేయలేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చిన దాఖలాల్లేవన్నారు. గ్రామాల్లో ఎప్పుడు కనిపించని టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకులు ప్రస్తుతం ఓట్ల కోసం ఏకమై ప్రజలను మోసం చేయడానికి కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ఈ ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ అనేక పథకాలతో పేదలకు అండగా నిలిచిందన్నారు. పంచేడులో రూ.11.54 కోట్లు, మినగల్లులో రూ.23.90 కోట్ల మేర ప్రజలకు లబ్ధి చేకూరిందన్నారు. ఇంకా అనేక అభివృద్ధి పనులను పారదర్శకంగా చేశామని తెలిపారు. కొందరు నాయకులు వైఎస్సార్‌సీపీకి ద్రోహం చేసి టీడీపీలో చేరారన్నారు. అ టువంటి నాయకులను భవిష్యత్‌లో పార్టీలో చేర్చుకునే ప్రసక్తి లేదన్నారు. టీడీపీ కోవూరు నియోజకవర్గ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి డబ్బులు పంచితే గెలుస్తామనే భ్రమల్లో ఉన్నారన్నారు. అటువంటి వారికి ఓటర్లు గుణపాఠం చెప్పేందుకు సిద్ధంగా ఉన్నా రన్నారు. కార్యక్రమంలో చైరపర్సన్‌ మో ర్ల సుప్రజ, మండల కన్వీనర్‌ సీహెచ్‌ సతీష్‌రెడ్డి, నాయకులు ప్రసాద్‌రెడ్డి, మధు, అనిల్‌కుమార్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement