పోస్టల్‌ బ్యాలెట్లనూ వదలని తమ్ముళ్లు | Sakshi
Sakshi News home page

పోస్టల్‌ బ్యాలెట్లనూ వదలని తమ్ముళ్లు

Published Tue, May 7 2024 5:10 AM

-

ఉదయగిరి: పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను కొల్లగొట్టేందుకు టీడీపీ ఉదయగిరి అభ్యర్థి కాకర్ల సురే్‌ష్‌ ఎత్తుగడ వేశారు. ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు ఈ అవకాశాన్ని కల్పించనుండటంతో, వీరికి రూ.2500 చొప్పున ఆశచూపి ఓట్లను లాక్కునేందుకు ఆయన విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా ప్రభుత్వోద్యోగులు ఓటేస్తారని తొలి రోజు భావించారు. అయితే వాస్తవ పరిస్థితులను తెలుసుకొని, తన అనుచరులను రంగంలోకి దింపి కొందరికి పెద్ద మొత్తంలో నగదు ఆశ చూపుతున్నారు. మరోవైపు మొదటి రోజు తక్కువ ఇచ్చి.. మరుసటి రోజు పెద్ద మొత్తం ఇవ్వడంతో టీడీపీ నేతలను పలువురు నిలదీస్తున్నారని సమాచారం. ఎన్నికలకు తొలి అంకంగా భావించే పోస్టల్‌ బ్యాలెట్లతోనే తమ రాజకీయ భవిష్యత్తుపై స్పష్టత వచ్చిందంటూ తమ్ముళ్లు గుసగుసలాడుకోవడం గమనార్హం.

Advertisement

తప్పక చదవండి

Advertisement