విద్యాశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వం విడుదల చేసిన 117 జీఓ కు అనుగుణంగా పాఠశాలల పునర్నిర్మాణం, బోధనా సిబ్బంది పునర్విభజన కోసం విద్యాశాఖాఽధికారులు తగిన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ ఆనంద్ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో విద్యాశాఖాధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మండలాల ఎంఈఓలు ప్రభుత్వ సూచనలు తప్పనిసరిగా పాటిస్తూ నూతన విధానానికి గ్రామ స్థాయిలో ప్రజలను సమన్వయపరిచి వారి మద్దతును సేకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఈఓ బాలాజీరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment