ప్రమాదంలో యువకుడి మృతి | Sakshi
Sakshi News home page

ప్రమాదంలో యువకుడి మృతి

Published Mon, May 6 2024 4:45 AM

ప్రమాదంలో యువకుడి మృతి

లేపాక్షి: ద్విచక్ర వాహనం అదుపు తప్పి కిందపడిన ఘటనలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన మేరకు... లేపాక్షి మండలం బయన్నపల్లికి చెందిన వినీత్‌ (22) ఇంట్లో ఆదివారం పుణ్యతిథి కార్యక్రమం ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు లేపాక్షిలో వేచి ఉన్న కొండూరు నుంచి వచ్చిన బంధువులను పిలచుకుని వెళ్లేందుకు ద్విచక్ర వాహనంపై వచ్చాడు. ఇద్దరు మహిళలను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని వెళుతుండగా మార్గమధ్యంలో వాహనం అదుపుతప్పి ముగ్గురూ కిందపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే హిందూపురంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వినీత్‌ను బెంగళూరుకు తీసుకెళుతుండగా కర్ణాటకలోని గౌరిబిదనూరు సమీపంలోకి చేరుకోగానే మృతి చెందాడు. గాయపడిన ఇద్దరు మహిళలు హిందూపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Advertisement
Advertisement