నల్లచెరువు: మండలంలోని ఊబిచెర్ల గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సబ్ సెంటర్ను శుక్రవారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ టాస్క్ ఫోర్స్ బృందం ఆకస్మిక తనిఖీ చేసింది. పలు రికార్ఢులను బృందంలోని సభ్యులు పరిశీలించారు. బాలింతలు, గర్భిణులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. విద్యార్థులకు రక్తహీనత పరీక్షలు నిర్వహించారు. డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ నాగేంద్ర, స్టాటిస్టికల్ అధికారి కళాధర్, డీపీఓ నాగరాజు, డీపీహెచ్ఎన్ఓ వీరమ్మ, సుబ్బారావు, డాక్టర్ కల్పనారెడ్డి, సీహెచ్ఓ రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
‘అనంత’ కలెక్టరేట్ కో–ఆర్డినేషన్
సూపరింటెండెంట్గా యుగేశ్వరి
అనంతపురం అర్బన్: శ్రీసత్యసాయి జిల్లా నుంచి బదిలీపై వచ్చిన తహసీల్దారు యుగేశ్వరిదేవి స్థానిక కలెక్టరేట్లోని కో–ఆర్డినేషన్ విభాగం సూపరింటెండెంట్గా నియమితులయ్యారు. ఈ మేరకు కలెక్టర్ వినోద్కుమార్ ఉత్తర్వులు జారీ చేయడంతో శుక్రవారం ఆమె బాధ్యతలు స్వీకరించారు.
Comments
Please login to add a commentAdd a comment