సత్యసాయి సేవలో కేంద్రమంత్రి మురుగన్‌ | - | Sakshi
Sakshi News home page

సత్యసాయి సేవలో కేంద్రమంత్రి మురుగన్‌

Published Sat, Oct 19 2024 12:30 AM | Last Updated on Sat, Oct 19 2024 12:30 AM

సత్యసాయి సేవలో  కేంద్రమంత్రి మురుగన్‌

ప్రశాంతి నిలయం: కేంద్ర సమాచార, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్‌ ఎల్‌.మురుగన్‌ శుక్రవారం సత్యసాయి సేవలో గడిపారు. శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరు నుంచి రోడ్డు మార్గంలో పుట్టపర్తి చేరుకున్న ఆయన నేరుగా ప్రశాంతి నిలయంలోని శాంతిభవన్‌ అతిథి గృహానికి చేరుకున్నారు. అక్కడ జాయింట్‌ కలెక్టర్‌ అభిషేక్‌ కుమార్‌ ఘన స్వాగతం పలికారు. సాయంత్రం కేంద్ర మంత్రి డాక్టర్‌ మురుగన్‌ ప్రశాంతి నిలయంలోని సాయికుల్వంత్‌ సభా మందిరంలో సత్యసాయి మహాసమాధిని దర్శించుకున్నారు. అనంతరం తిరిగి బెంగళూరు బయలుదేరి వెళ్లారు.

నేడు జెడ్పీ సర్వసభ్య సమావేశం

అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా పరిషత్‌ సర్వసభ్య సమావేశం జెడ్పీ కార్యాలయంలో శనివారం జరగనుంది. చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ అధ్యక్షతన జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10.30 గంటలకు సమావేశం ప్రారంభం కానున్నట్లు సీఈఓ లక్కిరెడ్డిపల్లె వెంకటసుబ్బయ్య శుక్రవారం తెలిపారు. మంత్రులు పయ్యావుల కేశవ్‌, సవిత, సత్యకుమార్‌ యాదవ్‌ సహా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలతో పాటు ఉమ్మడి జిల్లాలోని అన్ని శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు హాజరుకానున్నారని వివరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement