పుట్టపర్తి అర్బన్: అల్పపీడనం ప్రభావంతో గురువారం రాత్రి నుంచి శుక్రవారం వరకూ జిల్లాలోని 25 మండలాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా కదిరిలో 60 మి.మీ, ముదిగుబ్బలో 50.8 మి.మీ వర్షపాతం నమోదైంది. గాండ్లపెంట 37.8, బత్తలపల్లి 34.6, ఓడీచెరువు 28.6, రామగిరి 28, నల్లమాడ 26, ఎన్పీ కుంట 25, పెనుకొండ 18.4, నల్లచెరువు 18.2, తనకల్లు 15.6, అమడగూరు 13.4, కొత్తచెరువు 12.8, బుక్కపట్నం 12.4, రొద్దం 12, తాడిమర్రి 10.2, పుట్టపర్తి 8.6, తలుపుల 7.4, కనగానపల్లి 6.2, సీకేపల్లి 6, మడకశిర 4, సోమందేపల్లిలో 4, ధర్మవరం 3.8, హిందూపురం 2.6, అమరాపురం 1.6 మి.మీ మేర వర్షపాతం నమోదైంది. ఈ నెల 22వ తేదీ మరో తుపాను ముప్పు పొంచి ఉండటంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజా వర్షాలతో చిత్రావతిలో నీరు చేరింది. పెడపల్లి వద్ద ఆర్డీటీ కాజ్వేపై నీరు పారుతోంది. గాజులపల్లి చెరువు మరువ పారుతుండగా... వంగపేరు ఉధృతంగా ప్రవహిస్తోంది.
184 హెక్టార్లలో పంట నష్టం
తాజా వర్షాలతో జిల్లాలో 184 హెక్టార్లలో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయాధికారి సుబ్బారావు తెలిపారు. ఇందులో వేరుశనగ 116 హెక్టార్లు, వరి 33 హెక్టార్లు, కంది 14 హెక్టార్లు, పత్తి 10 హెక్టార్లు, కొర్ర 6 హెక్టార్లు, సామలు 2 హెక్టార్ల చొప్పున మొత్తంగా 184 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment