కాంగ్రెస్‌కు అడ్రస్‌ లేకుండా చేయాలి | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు అడ్రస్‌ లేకుండా చేయాలి

Published Tue, May 7 2024 5:20 AM

కాంగ్

కోదాడ: అబద్ధాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్‌ పార్టీకి లోక్‌సభ ఎన్నికల్లో అడ్రస్‌ లేకుండా చేయాలని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ సోమవారం రాత్రి కోదాడ రంగా థియేటర్‌ సెంటర్‌లో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఆరు గ్యారంటీలను అమలు చేయలేక గారడీ విద్యలు ప్రదర్శిస్తున్నారని, గుడులు, దేవుళ్లు అంటూ నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ సర్కార్‌ వచ్చిన తరువాత ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదని, ఉత్తమ్‌, కోమటిరెడ్డి, జానారెడ్డి కుటుంబాల్లో మాత్రం రెండేసి ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రే తనకు రైతుబంధు రాలేదని చెప్పడం కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరును తెలియజేస్తోందన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా కేసీఆర్‌.. రైతుబంధును ఆపలేదని గుర్తు చేశారు. కేసీఆర్‌ ప్రతి పక్షనాయకుడిగా హామీల అమలు గురించి అడుగుతుంటే సీఎం హోదాలో రేవంత్‌ దిగజారి మాట్లాడుతున్నాడని విమర్శించారు. కేంద్రంలో తెలంగాణ చక్రం తిప్పాలన్నా, కాంగ్రెస్‌ మెడలు వంచాలన్నా బీఆర్‌ఎస్‌ అభ్యర్థిని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ అధ్యక్షతన నిర్వహించిన ఈరోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, కటికం సత్తయ్యగౌడ్‌, సుంకర అజయ్‌కుమార్‌, పంకజ్‌యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి

కాంగ్రెస్‌కు అడ్రస్‌ లేకుండా చేయాలి
1/2

కాంగ్రెస్‌కు అడ్రస్‌ లేకుండా చేయాలి

కాంగ్రెస్‌కు అడ్రస్‌ లేకుండా చేయాలి
2/2

కాంగ్రెస్‌కు అడ్రస్‌ లేకుండా చేయాలి

Advertisement

తప్పక చదవండి

Advertisement