భానుపురి (సూర్యాపేట) : జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు అన్ని విధాలా సహకారం అందజేయనున్నట్లు కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ చెప్పారు. గురువారం సూర్యాపేట కలెక్టరేట్లో జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కొత్త పరిశ్రమల స్థాపనకు చేసుకున్న దరఖాస్తులను పరిశీలించి సింగిల్ విండో ద్వారా అనుమతులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న దరఖాస్తులను కూడా పరిశీలించి తక్షణమే మంజూరు చేయాలన్నారు. సంబంధిత శాఖలు ఎవరి పరిధిలోని అనుమతులు వారు సకాలంలో ఇవ్వాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీకి సంబంధించిన టీ ప్రైడ్ పథకం కింద 67 యూనిట్లు మంజూరు చేస్తూ కమిటీ తీర్మానం చేసిందని, టీఎస్ ఐపాస్ కింద 8 యూనిట్లకు గాను 19 అప్రూవల్స్పై కమిటీతో చర్చించినట్లు తెలిపారు. ఐటీ హబ్పై రెండు రోజుల్లో పూర్తి వివరాలు అందించాలని టీజీఐఐసీ డిస్ట్రిక్ట్ మేనేజర్ నాగరాజును కలెక్టర్ ఆదేశించారు. ఆటోనగర్కు సంబంధించిన పూర్తి నివేదికను శుక్రవారం సాయంత్రం వరకు అందజేయాలన్నారు. ఈ సమావేశంలో ఇండస్ట్రియల్ మేనేజర్ టి. సీతారాం, ఎల్డీఎం బాపూజీ, సీపీఓ కిషన్, ఫైర్ ఆఫీసర్ జానయ్య, మోటార్ వెహికిల్ ఇన్స్పెక్టర్ ఎ. ఆదిత్య, ఇతర అధికారులు యాదగిరి, మాధవి, బాలు, శంకర్, పి. వెంకటేశ్వర్లు, ఉదయ భాస్కర్ పాల్గొన్నారు.
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment