భానుపురి (సూర్యాపేట) : భూ సమస్యల పరిష్కారానికి నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో రెవెన్యూ అధికారులు, న్యాయవాదులు, రైతులు, యువకులు, పాత్రికేయులు, నిపుణులతో ఆర్ఓఆర్ చట్టం ముసాదాయి బిల్లుపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్ఓఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు, సూచనలు అందించాలని కోరారు. నూతన చట్టం రూపకల్పనలో రైతులను, ప్రజలను, మేధావులను భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వర్క్షాప్లు నిర్వహించాలని ఆదేశించిందని అన్నారు. నూతన రెవెన్యూ చట్టం–2024 బిల్లు అంశాలు, తీసుకురావడంలో ప్రభుత్వ ఉద్దేశాన్ని జిల్లా ఆదనపు కలెక్టర్ (రెవెన్యూ) బీఎస్ లత వివరించారు. ఈ సందర్భంగా పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు. చట్టం మార్పు చేసేటప్పుడు భూ సర్వే నిర్వహించాలని, భూమిపై ఉన్న రైతుల వివరాలు మాత్రమే నమోదు చేయాలన్నారు. గ్రామస్థాయి రెవెన్యూ వ్యవస్థ ఉండాలని, ప్రతి సంవత్సరం పహానీలో నూతన పేర్లు నమోదు చేయాలని, శిస్తు వసూలు మళ్లీ పెట్టాలని, కపొజిషన్ కాలం ఉండాలని సూచించారు. గ్రామాలవారీగా ఉన్న సర్వే నంబర్లలో భూమి ఎక్కువగా ఉంటుందని, దానిని సరిచేయాలని, భూమి అమ్మిన వారి పేర్లను తొలగించాలని, ధరణి పోర్టల్తో రైతులకు చాలా నష్టం జరిగిందని దాన్ని తీసివేయాలని కోరారు. ఈ సమావేశానికి రానివారు నూతన రెవెన్యూ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలు ఏమైనా ఉంటే ror2024&rev@telan gana.gov.in వెబ్సైట్లో అప్లోడ్ చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓలు వేణుమాధవ్, సూర్యనారాయణ, శ్రీనివాసులు, బార్ అసోసియేషన్ సభ్యులు సోమేశ్, తహసీల్దార్లు, న్యాయవాదులు, రెవెన్యూ సిబ్బంది, రిటైర్డ్ అధికారులు, రైతులు పాల్గొన్నారు.
ప్రతి సంవత్సరం పహాణీలు
విడుదల చేయాలి
పాత పద్ధతిలోనే ప్రతి సంవత్సరం పహాణీలను విడుదల చేయాలి. శిస్తు అమలు చేయకపోవడంతో రైతు ఎవరో తెలియడం లేదు. పాత రికార్డులను పునరుద్ధరించి ధరణి పోర్టర్ను సవరించి అమలు చేయాలి. –సామ వెంకట్రెడ్డి, మోతె
తహసీల్దార్లకు కొన్ని
అధికారాలు ఇవ్వాలి
గతంలో మాదిరిగానే 16 రకాల రికార్డులను నమోదు చేయాలి. పహాణీలను ప్రతి సంవత్సరం విడుదల చేయాలి. కాస్తు కాలం, కబ్జాకాలం ఉండాలి. రెవెన్యూ కోర్టులను అమలుపరచాలి. తహసీల్దార్లకు కొన్ని అధికారాలు ఇవ్వాలి. –ఎల్.భద్రయ్య రిటైర్డ్ తహసీల్దార్
కాస్తు కాలం ఉండాలి
ధరణి పోర్టర్లో కాస్తు కాలం, కబ్జాకాలం లేకపోవడంతో ఇష్టానుసారంగా పట్టాలు జరుగుతున్నాయి. కొత్త రెవెన్యూ చట్టంలో కాస్తూ కాలం తప్పనిసరి చేయాలి. వీఆర్వో వ్యవస్థను పునరుద్ధరించాలి. ప్రతి గ్రామంలో భూ రికార్డుల వివరాలు నోటీస్ బోర్డుపై ఉంచాలి.
–కాకి కృపాకర్రెడ్డి, ఆత్మకూర్ (ఎస్)
భూముల సర్వే చేయాలి
ప్రభుత్వం కొత్తగా చట్టాన్ని తీసుకురావాలంటే ముందుగా భూముల సర్వే చేయాలి. రికార్డులు సరిగా లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పాస్పుస్తకాల్లో ఉన్న సర్వే నంబర్కు, రైతు కబ్జాలో ఉన్న సర్వే నంబర్లకు పొంతన లేదు.
–నంద్యాల కృష్ణారెడ్డి, నంద్యాలవారిగూడెం
ఫ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్
Comments
Please login to add a commentAdd a comment