చివ్వెంల(సూర్యాపేట) : మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని అదనపు డీఆర్డీఓ సురేష్ అన్నారు. శుక్రవారం చివ్వెంల మండల కేంద్రంలోని రైతు వేదికలో ఇందిరా మహిళా శక్తి కార్యాక్రమంలో భాగంగా పాడి పశువుల పెంపకంపై మహిళా సంఘాల సభ్యులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం మహిళల కోసం అందించే అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పశు వైద్యాధికారులు పి.సంతోష్కుమార్, రాజశేఖర్, డీపీఎంలు గోవిందు, రత్తయ్య, ఆంజనేయులు, ఏపీఎం రాంబాబు, సీ్త్రనిధి మేనేజర్ సతీష్, ఉపేందర్, సీసీలు ఉపేందర్, వెంకన్న, రమణ తదితరులు పాల్గొన్నారు.
సీపీఎస్ రద్దు
చేయాలని ధర్నా
సూర్యాపేట టౌన్ : సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని సీపీఎస్ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు లక్కపాక ప్రవీణ్కుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర ఉద్యోగులకు సీపీఎస్ విధానాన్ని కొనసాగిస్తూ 23 ఆగస్టు 2014లో ప్రభుత్వం జారీ చేసిన జీఓ నంబర్ 28 కు వ్యతిరేకంగా శుక్రవారం జిల్లాలోని సీపీఎస్ ఉద్యోగులు నల్ల రిబ్బన్లు ధరించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం వీలైనంత త్వరగా సీపీఎస్ విధానం రద్దు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని కోరారు. నూతన పెన్షన్ విధానం రద్దు చేసేవరకు తమ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎస్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఉపాధి కల్పన అధికారి సరెండర్
భానుపురి (సూర్యాపేట) : జిల్లా ఉపాధి కల్ప న అధికారి అక్బర్ హబీబ్ను డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి సరెండర్ చేస్తూ కలెక్టర్ తేజస్ నంద్లాల్ పవార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. అక్బర్ హబీబ్పై పలు ఆరోపణలు రావడంతో విచారణ జరిపిన అనంతరం సరెండర్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment