సూర్యాపేటటౌన్ : విద్యార్థులకు సన్న బియ్యంతో వండిన నాణ్యమైన ఆహారం అందించాలని సివిల్ సప్లయ్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ద్రోణాచార్యులు అన్నారు. అడిషనల్ కలెక్టర్ బిఎస్ లతతో కలిసి శుక్రవారం సూర్యాపేట పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం భోజన పథకం, బియ్యం నాణ్యత పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, హాస్టళ్లలో బియ్యాన్ని పద్ధతి ప్రకారం భద్రపరచాలని ఆదేశించారు. ఎక్కడైనా బియ్యం నాణ్యతలో లోపాలు ఉంటే జిల్లా మేనేజర్, సివిల్ సప్లయ్ అధికారులకు తెలిపి వాటిని వెంటనే మార్చి మంచి బియ్యం తీసుకోవాలన్నారు. అడిషనల్ కలెక్టర్ బి.ఎస్.లత పాఠశాలలో విద్యార్థులకు పంపిణీ చేసే పాఠ్యపుస్తకాలను తనిఖీ చేశారు. మిగిలిన పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేయాలని సంబంధిత స్కూల్ ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం పదో తరగతి క్లాస్ రూం తనిఖీ చేసి విద్యార్థులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ ప్రసాద్, డీఎస్ఓ రాజేశ్వర్, సివిల్ సప్లయ్ టాస్క్ఫోర్స్ సభ్యులు, ఇన్చార్జ్ హెచ్ఎం సునీత, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
హుజూర్నగర్ పరిధిలో..
హుజూర్నగర్ : విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని మెనూ ప్రకారం ఇవ్వాలని స్టేట్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం ఓఎస్డీ ఎం ప్రభాకర్ అన్నారు. శుక్రవారం హుజూర్నగర్ పరిధిలోని మైనారిటీ గురుకుల పాఠశాలతోపాటు పలు గురుకుల వసతి గృహాలు, పాఠశాలలను టాస్క్ ఫోర్స్ టీం అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకుని విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. టాస్క్ఫోర్స్ స్పెషల్ ఆఫీసర్ లక్ష్మారెడ్డి, ఎస్ఐ జంగయ్య, కోదాడ డీటీసీఎస్ రాంరెడ్డి ఉన్నారు.
చిలుకూరు : మండల కేంద్రంలోని పలు గురుకుల పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారం రాష్ట్ర టాస్క్ఫోర్స్ బృందం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టళ్లలో మౌలిక వసతులు, భోజనం పరిశీలించి పలు సూచనలు చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఓఎస్డీ ఎం.ప్రభాకర్, టాస్క్ఫోర్స్ ప్రత్యేక అధికారి లక్ష్మారెడ్డి, ఎస్ఐ జంగయ్య, కోదాడ డీటీసీఎస్ ఎం.రామిరెడ్డి తదితరులు ఉన్నారు.
ఫ సివిల్ సప్లయ్ టాస్క్ఫోర్స్ ఓఎస్డీ ద్రోణాచార్యులు
Comments
Please login to add a commentAdd a comment