లింగ వివక్ష వద్దు
తిరుపతి అర్బన్: లింగ వివక్ష చూపవద్దని, ఆడపిల్లలను మగపిల్లలతో సమానంగా చూ డాల్సి ఉందని జిల్లా రెవెన్యూ అధికారి పెంచలకిషోర్ తెలిపారు. కలెక్టరేట్లో బుధవా రం బేటీ బచావో–బేటీ పడావో(బాలికను రక్షించండి– బాలికను చదివించండి) జిల్లా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ శిశులింగ నిష్ప త్తిని పెంచడం, ఆడ పిల్లలను రక్షించి, చది వించాలన్నదే భేటీ బచావో భేటీ పడవో పథకం ము ఖ్య ఉద్దేశం అని తెలిపారు. మహిళా హత్యలు, బాల్య వివాహాలను అరికట్టడంలో అన్ని శాఖల అధికారులు సమష్టిగా కృషి చేయాలని చెప్పారు. ఆడ పిల్లలు పుట్ట డం అనేది అదృష్టంగా భావించాలని, మగ పిల్లలతో సమానంగా ఆడ పిల్లలను పెంచాలని సూచించారు. ముఖ్యంగా స్కానింగ్ సెంటర్లపై వైద్య ఆరోగ్య శాఖాధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. ఏ బిడ్డ పుడతాడో ముందుగానే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయకూదని తెలిపారు. వైద్య విభాగం నేతృత్వంలో విద్యార్థులకు బేటీ బచావో–బేటీ పడావో పోటీలు నిర్వహించి నగదు బహుమతులను అందజేశారు. ప్రథమ బహుమతి రూ.5 వేలు, రెండో బహుమతి రూ.3 వేలు, మూడో బహుమతి రూ.2 వేలు ఇవ్వడంతోపాటు ప్రశాంసాపత్రం అందజేశారు. జిల్లా సీ్త్ర మరియు శిశు సంక్షేమ, సాధికారత అధికారి జయలక్ష్మి, డీఎంహెచ్ఓ డాక్టర్ శ్రీహరి, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ శ్రీలత పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment