అక్రమాలకు పాల్పడితే చర్యలు | - | Sakshi
Sakshi News home page

అక్రమాలకు పాల్పడితే చర్యలు

Published Sat, Sep 28 2024 11:22 AM | Last Updated on Sat, Sep 28 2024 11:22 AM

అక్రమాలకు పాల్పడితే చర్యలు

మోమిన్‌పేట: ఉపాధి హామీ పథకంలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్‌ హెచ్చరించారు. మండలంలో ఉపాధి మస్టరులో హాజరు వేయడంలో నిర్లక్ష్యం, జాబ్‌ కార్డులో ఉన్న సభ్యులలో ఒకరికి బదులు ఇంకొకరు పనులు చేయడం వంటి చర్యలకు రూ.73 వేలు జరిమానా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో 2023–24 సంవత్సరానికిగాను ఉపాధిహామీలో చేసిన పనులకు 15వ విడత సామాజిక తనిఖీ రాత్రి వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మండలంలోని 28 గ్రామ పంచాయితీల్లో నిర్వహించిన ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ కింద 716 పనులలో కూలీలకు చెల్లించిన మొత్తం రూ.6.97 కోట్లు కాగా మెటీరియల్‌ చెల్లింపులకు రూ.12.2 లక్షలు వెచ్చించినట్లు తెలిపారు. కూలీల హాజరులో అవకతవకతలకు పాల్పడిన పంచాయతీ కార్శదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లకు రూ.73 వేలను జరిమానా విధించామన్నారు. అదేవిధంగా ఒక దగ్గర చేయాల్సిన పనికి ఇంకో దగ్గర చేయడం, జాబ్‌ కార్డులో ఉన్న సభ్యులలో ఒకరికి బదులు ఇంకొకరు హాజరు కావడం వంటి వాటికి రూ.4.33 లక్షలు రికవరీ చేయాల్సిందిగా ఆదేశించామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సామాజిక తనిఖీ అధికారి ద త్తు, ఎంపీడీఓ విజయలక్ష్మి, సామాజిక తనిఖీ ఎస్‌ఆ ర్పీ రమేశ్‌, ఎంపీఏ యాదగిరి, ఏపీఓ శంకర్‌, ఈసీ, కార్యదర్శులు, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

సామాజిక తనిఖీలో రూ.73వేల జరిమానా

డీఆర్‌డీఏ ప్రాజెక్టు అధికారి శ్రీనివాస్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement