మోమిన్పేట: రాష్ట్రంలో కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం బీజేపీ అని పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్ పేర్కొన్నారు. శుక్రవారం మోమిన్పేటలో పార్టీ సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలనను ప్రపంచ దేశాధినేతలే ప్రశంసిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ ఒక్క ఎంపీ సీటు కూడా గెలువలేకపోయిందన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలు ఇచ్చి అమలు చేయలేక పోతుందన్నారు. ప్రభుత్వం ఏర్పడిన పది నెలలకే ప్రజల నుంచి వ్యతిరేకతను ఎదుర్కొంటుందన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారన్నారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు లక్ష్మారెడ్డి, వివేకానందరెడ్డి, వడ్ల నందు, శ్రీధర్రెడ్డి, పాండు, భుజంగారెడ్డి, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
కమలం పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు శివరాజ్
Comments
Please login to add a commentAdd a comment