● అప్రమత్తంగా వ్యవహరించినఆర్టీసీ డ్రైవర్ ● ఘటన సమయంలో బస్సులో 40మంది ప్రయాణికులు ● నిమ్స్లో చికిత్స పొందుతున్న గోపాల్గౌడ్
బషీరాబాద్: డ్రైవింగ్లో ఉండగా ఓ ఆర్టీసీ డ్రైవర్కు గుండెెపోటు వచ్చింది. క్షణాల్లో బస్సును పక్కకు నిలిపేసి, సీటులో ఒరిగిపోయాడు. ఈ ఘటన బషీరాబాద్ మండలం కాశీంపూర్ గ్రామ సమీపంలో సోమవారం చేటుచేసుకుంది. తాండూరు ఆర్టీసీ డీఎం సురేష్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. డిపోలో పనిచేస్తున్న డ్రైవర్ గోపాల్గౌడ్ విధుల్లో భాగంగా 40 మందిని తీసుకుని తాండూరు నుంచి బషీరాబాద్ వెళ్తున్నాడు. కాశీంపూర్ సమీపంలోకి రాగానే ఛాతిలో తీవ్రమైన నొప్పి రావడంతో అప్రమత్తమై వెంటనే బస్సును పక్కకు నిలిపేశాడు. కండక్టర్, కొందరు ప్రయాణికులు స్పందించి అతనికి సీపీఆర్ చేశారు. అనంతరం 108 అంబులెన్స్లో తాండూరులోని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం నిమ్స్కు తీసుకెళ్లారు. ప్రస్తుతం గోపాల్గౌడ్ ఆరోగ్యం నిలకడగా ఉందని ఆర్టీసీ అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment