కమీషన్‌ డబ్బులు విడుదల చేయండి | - | Sakshi
Sakshi News home page

కమీషన్‌ డబ్బులు విడుదల చేయండి

Published Tue, Oct 1 2024 8:14 PM | Last Updated on Tue, Oct 1 2024 8:14 PM

-

మహేశ్వరం: రేషన్‌ షాపుల్లో లబ్ధిదారులకు ఉచిత బియ్యం పంపిణీ చేసిన కమీషన్‌ డబ్బులను వెంటనే విడుదల చేయాలని రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం నగరంలో రాష్ట్ర సివిల్‌ సప్‌లై జాయింట్‌ కమిషనర్‌ ఎం.కే.రాథోడ్‌నును కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం పేదలకు రేషన్‌ షాపుల ద్వారా పంపిణీ చేస్తున్న ఉచిత బియ్యాన్ని సక్రమంగా పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. కమీషన్‌ డబ్బులు సకాలంలో రాక పోవడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురవుతున్నట్టు చెప్పారు. ఏ నెలకు సంబంధించిన కమీషన్‌ అదే నెలలో విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో రాష్ట్ర రేషన్‌ డీలర్ల సంక్షేమ సంఘం వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులిమామిడి లక్ష్మీనారాయణ గౌడ్‌, జిల్లా వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ భానుచందర్‌ గౌడ్‌, డీలర్లు చంద్రశేఖర్‌రెడ్డి, కృష్ణ, విజయ్‌ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement