పటిష్ట ఏర్పాట్ల మధ్య ఈవీఎంల కమిషనింగ్‌ | Sakshi
Sakshi News home page

పటిష్ట ఏర్పాట్ల మధ్య ఈవీఎంల కమిషనింగ్‌

Published Sun, May 5 2024 1:40 AM

పటిష్ట ఏర్పాట్ల మధ్య  ఈవీఎంల కమిషనింగ్‌

వరంగల్‌: ఏనుమాములలోని మార్కెట్‌ గోదాంలలో పటిష్ట ఏర్పాట్ల మధ్య ఈవీఎంల కమిషనింగ్‌ ప్రక్రియ ప్రారంభమైందని ఏఆర్‌ఓ, గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే అన్నారు. శనివారం ఆమె వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధి వరంగల్‌ (తూర్పు) నియోజకవర్గానికి చెందిన ఈవీఎంల కమిషనింగ్‌ నిర్వహించారు. అదనపు కలెక్టర్‌ సంధ్యారాణి ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఏనుమాములలో స్ట్రాంగ్‌ రూమ్‌ను తెరిచి కమిషనింగ్‌ను ప్రారంభించారు. కార్యక్రమంలో వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, వరంగల్‌ తహసీల్దార్‌ ఇక్బాల్‌, ఎన్నికల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement