మేడారంలో మినీ జాతర పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. జంపన్నవాగు వద్ద బ్యాటరీ ఆఫ్ ట్యాప్ నల్లాల పనులు ఇంకా కొనసాగుతుండడంతో ఆదివారం అమ్మవార్ల దర్శనానికి వచ్చి న భక్తులు స్నానాల కోసం ఇబ్బందులు పడ్డారు. ప్రైవేట్ వ్యవసాయదారుల బోరింగ్ మోటార్ల వద్ద స్నానాల కోసం ఒక్కో భక్తుడు రూ.10 చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొక్కుల అనంత రం మేడారం పరిసర ప్రాంతాల్లో భక్తులు విడిది చేశారు. భక్తులు ఉన్న ప్రదేశాల్లో తాగునీటి వసతి సౌకర్యాలు లేకపోవడంతో మినరల్ వాటర్ కొనుగోలు చేసి దాహం తీర్చుకోవడంతో పాటు వంటకు కూడా వినియోగించుకోవాల్సి వచ్చింది. ముందస్తుగా మేడారానికి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించాలని మంత్రులు, ములుగు కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినప్పటికీ కొన్ని శాఖల అధికారుల్లో మార్పు కనిపించట్లేదు.
Comments
Please login to add a commentAdd a comment