ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలి..
ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ
వరంగల్ క్రైం: అభివృద్ధి పనుల్లో భాగంగా చేపట్టిన డ్రెయిన్ నిర్మాణాలు, రోడ్ల మరమ్మతులు కారణంగా నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు, వాహనదారులు ఈ విషయాన్ని గమనించి ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణించాలని హనుమకొండ ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
ఆంక్షలు,
మళ్లించిన దారి ఇలా..
● హనుమకొండలోని అలంకార్ సెంటర్కి సమీపంలో ములుగు క్రాస్ రోడ్డు నుంచి వేయిస్తంభాల గుడి వైపు వచ్చే దారిలో డ్రెయినేజీ నీటి కోసం మెయిన్ రోడ్డుపై డ్రెయిన్ నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా వన్ వే ఏర్పాటు చేశారు.
● సోమవారంనుంచి ఈ దారిలో లారీలు, ఆర్టీసీ బస్సులు, రెడీమిక్స్ వాహనాలు, ట్రాక్టర్లు, ఇతర కమర్షియల్ వాహనాలకు అనుమతి లేదు.
● వాహనదారులు ములుగు క్రాస్ రోడ్డు నుంచి పెద్దమ్మగడ్డ మీదుగా కేయూ జంక్షన్ వైపు ప్రయాణించాల్సి ఉంటుంది.
● హనుమకొండ బస్టాండ్, నక్కలగుట్ట, కాజీపేట వైపు వెళ్లాల్సిన టూవీలర్స్, ఆటోలు, కార్లు, మొదలగు వాహనాలు అలంకార్ సెంటర్, కాపువాడ, బాలంజనేయ స్వామి దేవాలయం మీదుగా ప్రయాణించాలి.
● వేయి స్తంభాలు గుడి నుంచి అలంకార్ సెంటర్ వరకు, అలంకార్ సెంటర్ నుంచి బాలాంజనేయస్వామి దేవాలయం వరకు రోడ్కి ఇరు వైపులా ఎటువంటి వాహనాలు పార్కింగ్ చేయరాదు.
● వాహనాలను రోడ్డుపై మరమ్మతులు చేయరాదు. ఈమార్గంలో ఇతర తోపుడు బండ్లకు కూడా అనుమతి లేదు.
● వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ రోడ్లలో ప్రయాణించి తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని ట్రాఫిక్ ఏసీపీ సత్యనారాయణ కోరారు.
Comments
Please login to add a commentAdd a comment