ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించాలి
హన్మకొండ: ప్రజా సమస్యలపై అధికారులు సత్వరమే స్పందించాలని హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య అన్నారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన ప్రజలనుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో 71 దరఖాస్తులు వచ్చాయన్నారు అధికారులు వీటిని పరిశీలించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజావాణి దరఖాస్తులపై అలసత్వం తగదన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ గణేశ్, ఆర్డీఓ నారాయణ, డీఆర్డీఓ మేన శ్రీను, జెడ్పీ సీఈఓ విద్యాలత, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ పి.ప్రావీణ్య
ప్రజావాణికి 71 దరఖాస్తులు
Comments
Please login to add a commentAdd a comment