ఊరూరా వైఎస్సార్ సీసీ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. నేతలు ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మమేకమవుతున్నారు. గత పాలనకు, జగన్ పాలనకు తేడా గమనించాలని, ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి మరోసారి ప్రజాప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరుతున్నారు. సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా, రాష్ట్ర అభివృద్ధి జరగాలన్న జగనన్నకే పట్టం కట్టాలని ఓట్లు అభ్యర్థిస్తున్నారు. నెరవేర్చని వాగ్దానాలతో, మాయమాటలతో మోసగించే కూటమి అభ్యర్థులను తరిమికొట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.