వైభవం.. వాసవీ మాత రథోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవం.. వాసవీ మాత రథోత్సవం

Published Fri, Oct 18 2024 12:52 AM | Last Updated on Fri, Oct 18 2024 12:56 AM

వైభవం

తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం టూటౌన్‌లోని శ్రీవాసవీ కన్యకా పరమేశ్వరీ పంచాయతన క్షేత్రంలోని అమ్మవారి వెండి రథోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ ఈ రథోత్సవాన్ని ప్రారంభించారు. 108 వెండి కలశాలతో 108 మంది మహిళలు, ఐదు రాష్ట్రాల నుంచి వచ్చిన 250 మంది కళాకారులు, విభిన్న వాయిద్యాలు, నృత్య ప్రదర్శనలు, బాణసంచా పేలుళ్లు, తమిళనాడుకు చెందిన డప్పు కళాకారులు, లైటింగ్‌ నడుమ రథోత్సవం ఆకట్టుకుంది. ఆర్యవైశ్య సంఘం, వాసవి క్లబ్‌, వాసవి వనిత, మహిళా సంఘాలు ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో భక్తులు ఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఆర్యవైశ్య నాయకులు పేరూరి కాశయ్య, కోన శ్రీనివాసరావు, గౌరవాధ్యక్షుడు మారం వెంకటేశ్వరరావు, ఉత్సవ కమిటీ అధ్యక్షుడు వబిలిశెట్టి నటరాజు, అధ్యక్షుడు కొర్లెపల్లి రాము, ఆర్యవైశ్య కార్యదర్శి నున్న సుందరరావు, రథోత్సవ కమిటీ చైర్మన్‌ నారాయణ రాంబాబు ఏర్పాట్లు పర్యవేక్షించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
వైభవం.. వాసవీ మాత రథోత్సవం 1
1/1

వైభవం.. వాసవీ మాత రథోత్సవం

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement