క్లాప్ ఆటోలను కొనసాగించాలి
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థలో మూడేళ్లుగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) పేరుతో ఇంటింటా చెత్త సేకరిస్తున్న 60 ఆటోలను ఈనెల 1వ తేదీ నుంచి కూటమి ప్రభు త్వం నిలిపివేసింది. దీంతో 60 మంది డ్రైవర్లు రోడ్డున పడ్డారు. క్లాప్ ఆటోలను కొనసాగించాలని, 60 మంది డ్రైవర్లను విధుల్లోకి తీసుకోవాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) రాష్ట్ర ఉపాధ్యక్షుడు బి.సోమయ్య డిమాండ్ చేశారు. స్థానిక పవర్పేట కార్యాలయంలో ఆదివారం యూనియన్ అధ్యక్షుడు వి.రాజు అధ్యక్షతను సమావేశం నిర్వహించారు. ఇంటింటా చెత్త సేకరణ నిలిపివేయడం దారుణమని సోమయ్య అన్నారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు లావేటి కృష్ణారావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.జాన్ బాబు మాట్లాడుతూ నోటీసులు ఇవ్వకుండా డ్రైవర్లను అక్రమంగా తొలగించడం అన్యాయమన్నారు. సమావేశంలో క్లాప్ ఆటో డ్రైవర్ల నాయకులు గణేష్, శ్రీను, కుమార్, 60 మంది డ్రైవర్లు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment